Tuesday, September 17, 2024

AP | గంజాయి కేసు.. ముగ్గురి అరెస్టు !

తిరుపతి క్రైమ్ (ప్రభన్యూస్) : తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని ఉక్కుపాదంతో అణిచి వేయడం జరుగుతుందని సీఐ మహేశ్వర్ రెడ్డి ఆదివారం తెలిపారు. స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంటలో గంజాయి విక్రయిస్తున్న వారిపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో కందటి సాయిచంద్, ఆర్.దేవరాజన్, ఎస్.హరినాథ్ సింగ్‌లను అరెస్టు చేసి వారి నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారి ప్రవర్తనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement