Sunday, September 8, 2024

AP | టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..

ఏపీలో ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు లాంటి మైనారిటీ విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. వారి కోసం టెట్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. వీటి ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు. ఏపీ- టెట్ 2024 కోసం ఉర్దూ, తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వనున్నామని మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ తెలిపారు.

ఈ ఉచిత శిక్షణా శిబిరాలు రాష్ట్రంలో మొత్తం 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. కాగా, మైనారీటీల్లో ఆత్మష్పైర్యాన్ని పెపంపొందిచడానికి ఇవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement