Friday, October 18, 2024

AP | డయేరియాతో ఒకేరోజు నలుగురు మృతి..

విజయనగరం జిల్లాలోని గ్రామాల్లో డయేరియా ఎక్కువగా ఉంది. మూడు రోజుల వ్యవధిలో డ‌యేరియా కార‌ణంగ‌గా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా… ఈరోజు ఒక్క‌రోజే నలుగురు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పైడమ్మ (50) అనే మహిళ మృతి చెందగా… చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో సారిక పెంటయ్య (65), కలిశెట్టి సీతమ్మ (45) మృతి చెందారు. తొండ్రంగి రామయ్యమ్మ(60) ఇంటివద్దే మృతి చెందింది.

కాగా, మరో 10 మంది బాధితులు విజయనగరం, విశాఖపట్నంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మృతులందరికీ డయేరియాతోపాటు గుండె, కిడ్నీ, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement