Friday, September 6, 2024

Follow up – భార్యపై అనుమానంతోనే…చిన్నారి హత్య.. తండ్రే నిందితుడు


ఆంధ్రప్రభ స్మార్ట్, అనంతపురం బ్యూరో : తాను తాళికట్టిన భార్యపై అనుమానం పెనుభూతమైన తరుణంలో ఆరేళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డనే హతమార్చి బావిలో పడవేసిన ఓ కసాయి వైనం ఇది. పైగా తన కుమార్తె కనిపించటం లేదని తమ ఎదుటే కన్నీళ్లు కార్చిన కపట తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన సభ్య సమాజాన్ని ఆశ్చర్యంలో ముంచి తేల్చింది. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన గణేష్అనేవ్యక్తిశుక్రవారం తన కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఊళ్లోనే బంధువుల ఇళ్లల్లో ఆడుకుంటుందేమో చూడమని పోలీసులు చెప్పారు. అలాగే బాలిక ఆచూకీకి రంగంలోకి దిగారు. కానీ జాడ తెలియలేదు. కుటుంబ సభ్యులనూ విచారించారు.

తండ్రే హంత‌కుడిని తేలింది ఇలా..

కొన్నాళ్లుగా గణేష్తనకుమార్తెపావనిపట్లఅయిష్టంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం వచ్చింది. ఇంతలో నార్పల బస్టాండు సమీపంలో చిన్నారి పావని మృతదేహం కనిపించింది. ఇక ఎస్పీ గౌతమి శాలి రంగం ప్రవేశం చేశారు. నార్పలకు వచ్చి నేర స్థలిని స్వయంగా పర్యవేక్షించారు. తండ్రే హంతకుడనే అంశాన్ని గుర్తించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక సోలీసులు చిన్నారి పావని తనకు పుట్టలేదని, తన భార్య వివాహేతర సంబంధంతో ఈ చిన్నారికి జన్మనిచ్చినట్లు గణేష్ అనుమానం వ్యక్తం చేశాడు… తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గణేష్ పోలీస్ విచారణ లో తెలిపాడు.. అదిగాక స్కూలులో చేర్పించే దగ్గర నుండి, ప్రతి విషయంలోనూ తన భార్య పెత్తనాన్ని సహించలేకపోయానని గణేష్ వివరించాడు. ఇక తట్టుకోలేక తన భార్యపై అనుమానంతోనే కూతురి పావని గొంతు నులిమి చంపి.. బావిలోపడేసినట్లు గణేష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement