Monday, September 16, 2024

Flood Relief Fund – కోటి రూపాయల సాయం ప్రకటించిన చిరంజీవి

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు విరాళంగా అందించనున్నట్టు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని చిరు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement