Sunday, September 8, 2024

Flash News – కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో బ్లాస్ట్ … ఒక‌రి మృతి

అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో జ‌రిగిన‌ భారీ పేలుడులో ఒక‌ర మ‌ర‌ణించారు.. వసంత కెమికల్స్ కంపెనీలో నేటి ఉద‌యం ఒక్కసారిగా రియాక్టర్ పేలి పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు ఫ్యాక్టరీ నుండి బయటకు పరుగులు తీశారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు రియాక్టర్ పేలడానికి ఓవర్ హీటే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి రియాక్టర్ బ్లాస్టింగ్‌పై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement