Thursday, July 4, 2024

First White Paper – పోల‌వ‌రంపై శ్వేత‌ప‌త్రం…నేడు విడుద‌ల చేయ‌నున్న ప్ర‌భుత్వం….

అమ‌రావ‌తి – ఎపిలో అధికారం చేప‌ట్టిన వెంట‌నే వివిధ అంశాల‌పై శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు… దీనిలో భాగంగా ఆర్ధిక శాఖ విభాగం వివిధ అంశాల‌పై శ్వేత‌ప్ర‌తాలు రూప‌క‌ల్ప‌న ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లారు. అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసంపై వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు. జగన్‌ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, అధికారులతో చర్చించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement