Thursday, September 19, 2024

AP | టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం.. పలు ఫైళ్లు దగ్ధం

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో (శనివారం) అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఫైల్ ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.

అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. టీటీడీ పరిపాలన విభాగం కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో తిరుపతిలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. టీటీడీ పరిపాలనా విభాగం భవనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయా… మరేదైనా కుట్ర కోణం ఉందా అంటూ పలు కోణాలలో అలిపిరి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement