Sunday, September 15, 2024

Fire accident – తిరుపతిలో అగ్నికి ఆహుతైన హోటల్

తిరుపతి, ఆగస్టు 6 (ప్రభ న్యూస్ ప్రతినిధి): తిరుపతి కేశవాయన గుంటలోని టీటీడీ ఎస్ జి ఎస్ కళాశాల సమీపంలో హోటల్ లో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి అగ్నికి ఆహుతి అయింది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పైకప్పు కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో హోటల్లో ఉన్న వంట సామాగ్రి, ఆహార పదార్థాలు, సరుకులు, ప్లాస్టిక్ కుర్చీలు, బల్లలు,ఫ్యాన్లు, వంటకు వినియోగించడానికి సిద్ధం చేసి ఉన్నసామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తిగా మంటల్లో హోటల్ కాలిపోయింది. సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement