Saturday, September 21, 2024

AP: పోలీసు కుటుంబాల‌కు ఆర్థికసాయం.. చెక్కులు అంద‌జేసిన ఎస్పీ సుబ్బ‌రాయుడు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, తిరుప‌తి : మృతిచెందిన పోలీసుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అంద‌జేసిన‌ట్లు జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు. ఎస్సై రెడ్డి నాయక్ కు సతీమణి సరోజకి రూ.1,50,000లు, ఏ.ఆర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ తల్లి సుశీలమ్మకి రూ.1,25,000, హోంగార్డ్ మోహన్ సతీమణి కవితకి రూ.15,000ల చెక్కును జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు.

విధులు నిర్వ‌హిస్తూ…
తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌ ఎస్సై రెడ్డి నాయక్ 02-08-2024 వ తేదీన ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ 10-04-2024 వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. టిటిడి విజిలెన్సు లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎం. మోహన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ 12.05.2024 న మ‌ర‌ణించారు.

పోలీసు కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం …
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విభాగానికి అందరూ ఎనలేని సేవలు అందించాలని, వారి సేవలను జిల్లా పోలీస్ యంత్రాంగం గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో మీకు శాఖపరమైన ఎలాంటి సహాయం అవ‌స‌రం ఉన్నా పోలీసు శాఖ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఏ అవసరం వచ్చినా నిర్భయంగా వచ్చి పోలీస్ కార్యాలయానికి రావాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement