Saturday, June 29, 2024

AP: రోడ్డు ప్రమాదంలో.. తండ్రీ కొడుకుల మృతి

నందిగామ, జూన్ 29 (ప్రభ న్యూస్) : కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సుమారుగా రాత్రి 1గంట‌ సమయంలో ఐతవరం గ్రామం జాతీయ రహదారిపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తండ్రి కొడుకు మృతిచెందారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పెద్ద శబ్దం రావటంతో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులు రోడ్డు మీదకు వచ్చి ఏం జరిగిందని చూస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగిందని గ్రామ‌స్తులు తెలిపారు.

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా పెట్రోలింగ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహించే సంకు రామరాజు లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కీసర టోల్ ప్లాజాకి సమాచారం ఇచ్చేందుకు లారీ ముందు నిలబ‌డి ఫోన్ చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. దీంతో లారీ తండ్రి, కొడుకుల మీద నుంచి వెళ్ల‌డంతో స్పాట్ లోనే సంకు రామరాజు(38) తండ్రి సంకు మాధవరావు(55) మృతి చెందిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement