Friday, September 20, 2024

AP: ఫేక్ ప్రచారాలే వైసీపీ సిద్ధాంతం… బైరెడ్డి శ‌బ‌రి

నంద్యాల బ్యూరో, ఆగస్టు 27 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలోని ప్రజలు వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పి 11సీట్లకే పరిమితం చేసిన ఫేక్ ప్రచారాలు మానుకోలేదని ఫేక్ జగన్ రెడ్డి అంటూ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మంగళగిరి నుంచి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం మంచి పనులు చూసి ఓర్వలేనితనం ఉందన్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమయ్యారన్నారు. మీ ఫేక్ ప్రచారాలే మీ కొంపలు ముంచినా కుక్క తోక వంకర అన్న చందాన జగన్ రెడ్డి బుద్ధి మారలేదని విమర్శించారు.

పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఫేక్ ప్రచారమే పనిగా పెట్టుకున్నారని, అన్న క్యాంటీన్లపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 28వ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని 16వ తేదీనే సర్కులర్ జారీ చేశామ‌న్నారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కేబినెట్ మీటింగ్ కావాలనే వాయిదా వేశారంటూ లోకేష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గడిచిన ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ఫేక్ ప్రచారాలతో పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మీరు వెలగబెట్టిన కార్యాలను ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లిచ్చారన్నారు.

- Advertisement -

ఇప్పుడు కూడా అదే పంధాని కొనసాగిస్తూ నిజమైన వార్తలను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలపైనా, నాయకులపైనా, లోకేష్ పై, చంద్రబాబు నాయుడు పై ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తే ఈ సారి 11 సీట్లు కాదు కదా పార్టీనే మూసేసుకుని పరిస్థితి వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement