Thursday, October 3, 2024

APPSC | మిలటరీ కళాశాలలో ప్రవేశ పరీక్ష.. దరఖాస్తు గడువు పొడిగింపు

డె హ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కళాశాలలో ప్రవేశానికి గాను నిర్వహించనున్న రాత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబరు 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 30వ తేదీతో గడువు ముగియనుండగా అక్టోబరు 10 వరకు అవకాశం కల్పించారు. అర్హత కలిగిన బాల, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement