Saturday, September 21, 2024

AP: 19నుండి ఇంజనీరింగ్… తుది, మూడో దశ ప్రవేశాల ప్రక్రియ

నోటిఫికేషన్ విడుదల చేసిన కన్వీనర్ గణేష్ కుమార్
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్ 2024 తుది, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 19న‌ ప్రారంభమ‌వుతుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు ఆగస్టు 19నుండి ఆగస్టు 21లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి ఆగస్టు 22వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఆగస్టు 20నుండి 22వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేసారు.

ఐచ్చికాల మార్పున‌కు ఆగస్టు 23వ తేదీ నిర్దేశించామన్నారు. 26వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం ఆగస్టు 26 నుండి ఆగస్టు 30వరకు ఐదురోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభమ‌య్యాయని కన్వీనర్ వివరించారు. విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపిక సందర్భంలో ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని, అది సమస్యలకు దారి తీస్తుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement