Friday, September 13, 2024

మూడో ద‌శ‌లోనూ వెల్లువెత్తిన పోలింగ్…కొన‌సాగుతున్న కౌటింగ్..

అమరావతి: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఈ విడ‌త‌లో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకుర పోటెత్తారు… అత్య‌ధిక పోలింగ్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌ర‌గ‌గా, అత్య‌ల్పం విశాఖ జిల్లాలో న‌మోదైంది.. . రాష్ట్రంలో 2639 సర్పంచ్‌, 19,553 వార్డులకు పోలింగ్‌ ముగిసింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 65 శాతం పోలింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 70, పశ్చిమగోదావరి జిల్లాలో 72, కృష్ణా 79, గుంటూరు 81 శాతం పోలింగ్ జరిగింది. ప్రకాశం 79, నెల్లూరు 79, చిత్తూరు 77, కడప 68 శాతం పోలింగ్ జరిగింది. కర్నూలు 79, అనంతపురం జిల్లాలో 78 శాతం పోలింగ్ జరిగింది. ఈ బ్యాలెట్ లెక్కింపును అధికారులు ప్రారంభించారు.. ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement