Saturday, October 26, 2024

Election Case – ఐకాన్ స్టార్ కు హైకోర్టులో ఊర‌ట …

అమ‌రావ‌తి – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎపి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రాగా.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం ప్ర‌క‌టించింది.

ఐకాన్ స్టార్ చూసేందుకు వెల్లువెత్తిన అభిమానులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు.. విష‌యం తెలుసుకున్న ఆయ‌న అభిమానులు ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆర్వో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాల‌ని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్ర‌యించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement