Sunday, September 8, 2024

AP | ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన..

తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి తాజా ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల మేరకు నవంబర్ 1లోగా జాబితా రూపొందించేందుకు షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల నమోదుకు ఈసీ నోటీసులు జారీ చేయనుంది.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గం, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న నోటీసు జారీ చేయ‌నుంది. 2024 డిసెంబర్ 30 నాటికి తుది ఓటరు జాబితా సిద్ధం చేస్తామని సీఈవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం మార్చి 29తో ముగుస్తుందని ఈసీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement