గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరులోని ఒక ప్రైవేటు ట్రావెల్స్ కార్యాలయానికి బస్సులో రహస్యంగా డ్రగ్స్ రవాణా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీస్ బృందాలు సదరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కొన్ని డ్రగ్స్ పాకెట్లను గుర్తించి సీజ్ చేశారు. కాగా వాటిని బస్సులో రహస్యంగా రవాణా చేసిన వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- Advertisement -