Tuesday, October 22, 2024

AP | అమిత్ షాతో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ లు ఏర్పాటయ్యాయని, ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం లేదా అమరావతిలో NFSU క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బేడ జంగం సమస్యలు పరిష్కరించండి…

అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న బేడ (బుడగ) జంగం సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక నిర్మాణంలో ప్రత్యేకమైన, సమగ్రమైన పాత్ర పోషిస్తున్న బేడా.. సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు, సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని,, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీలో సరైన గుర్తింపు కోసం వారి డిమాండ్ లను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement