Tuesday, September 17, 2024

Donations – ఎంపీ మాగుంట ఫ్మామిలీ ₹కోటిన్నర .. వేమారెడ్డి దంపతులు ₹కోటి సాయం

ఆంధ్రప్రభ స్మార్ట్, నెల్లూరు: ఏపీలో వరద తాకిడితో తల్లడిల్లుతున్న జనం వ్యథలపై నెల్లూరు ఎంపీ వేమారెడ్డి ప్రభాకర రెడ్డి దంపతులు చలించిపోయారు. తమ వంతు ఉడుత సాయాన్ని సీఎంఆర్ ఎఫ్ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబుని కలసి ఆయన చెక్కుని అందించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఆర్థిక సాయం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ఫ్యామిలీ తరపున కోటీ యాభై లక్షల రూపాయల భారీ సాయాన్ని ఆయన అందజేశారు. సీఎం చంద్రబాబుని కలసి చెక్కు అందించారు. అంతకు ముందే ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియాకు రూ.10లక్షల చెక్కుని కూడా అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement