Saturday, September 14, 2024

AP: శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు బంగారు పూలు విరాళం..

కర్నూలు బ్యూరో : శ్రీశైల, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంకు ఓ భక్తుడు బంగారు పూలను శుక్రవారం బహుమతిగా అందజేశారు. కర్నూల్ కు చెందిన బీసీ శివకుమార్ దేవస్థానంన‌కు 108 బంగారు పూలను విరాళంగా సమర్పించారు. ఈ బంగారు పూల మొత్తం బరువు 19 గ్రాములు.

అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణ, పర్యవేక్షకులు కె. అయ్యన్న, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టరు కె.మల్లికార్జున, సంబంధిత గుమాస్తా ఎం.సావిత్రిలకు అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదు, వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు, ఆలయ అధికారులు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement