Thursday, September 19, 2024

AP | ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డాక్టరేట్ ప్రధానం..

ముత్తుకూరు,(ప్రభ న్యూస్): రాష్ట్రంలోని మత్స్య కళాశాల – (ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ)కి చెందిన ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్ డీలో డాక్టరేట్లు లభించాయి. ఈ నేపథ్యంలో (బుధవారం) తమిళనాడులోని డాక్టర్ జయలలిత ఫిషరీష్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ముత్తుకూరు కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీరభద్రరావు, దీప్తి, త్రివేణి, శ్రావణి, ప్రభంజన్‌కుమార్‌రెడ్డి, జషింతిలకు డాక్టరేట్ ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి ఏపీకి చెందిన ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను సత్కరించి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మత్స్య కళాశాల ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement