Friday, September 20, 2024

AP | కర్నూలు పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ…

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా డీపీఓలోని అన్ని విభాగాల పనితీరుపై సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ డీపీఓ సీసీ కెమెరాల కంట్రోల్ రూం, డయల్ 100 రూమ్, డీసీఆర్‌బీ, ఆర్మ్ డు రిజర్వ్, ఆయుధ గోదాం, పోలీస్ క్యాంటీన్, ఫుడ్ కోర్ట్, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర పరిసరాలను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నాగరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పీసీఆర్ సీఐ శివశంకర్, డీసీఆర్ బీసీఐ గుణశేఖర్ బాబు, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్యనాయుడు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.

మంత్రి టీజీ.భరత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్

కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందుమాధవ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్ ను సంకల్‌బాగ్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement