Thursday, September 19, 2024

AP | వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ : మంత్రి నాదెండ్ల

భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేపటి నుంచి (శుక్రవారం) విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతామ‌ అని ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 2 లక్షల మందికి సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement