Thursday, October 17, 2024

Breaking: ముచ్చుమరి ఘటనలో సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసిన డిఐజి

నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐ, ఎస్ఐలపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా మిస్సింగ్ కేసు నమోదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్.జయశేఖర్ లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement