Tuesday, September 17, 2024

Devotional – కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరు, సెప్టెంబరు 8 (ప్రభ న్యూస్) కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభమై భాగంగా ఆదివారం ఉదయం వైభవంగా ధ్వజస్తంభమునకు ధ్వజారోహణము నిర్వహించారు. శాస్త్ర యుక్తంగా ధ్యజస్థంభానికి పూజలు నిర్వహించి, ధ్యజన్ని ఎగురవేశారు.

బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈ.వో గురు ప్రసాద్, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ చైర్మన్లు జగన్నాథ రెడ్డి, మణి నాయుడు, మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధిలు, ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement