Thursday, September 12, 2024

AP | గుండ్లకమ్మ వాగులో చిక్కుకున్న భక్తులు సురక్షితం..

(ఒంగోలు బ్యూరో, ప్రభన్యూస్) : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. గత 24 గంటలుగా కురిసిన భారీ వర్షాలకు జేపీ చెరువు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.

దీంతో వందమందికి పైగా భక్తులు ఆలయం వద్ద నిలిచిపోయారు. సమాచారాన్ని అందుకున్న రాచర్ల పోలీసులు హుటాహుటిన గుండ్లకమ్మ వాగు వద్దకు చేరుకున్నారు. ట్రాక్టర్లు ఉపయోగించి భక్తులను వాగును దాటించారు. సుమారు రెండు గంటలకు పైగా అధికారులు శ్రమించి భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement