Tuesday, September 17, 2024

Devotees – సింహ‌ద్రి అప్ప‌న్న‌కు బంగారు హారం కానుక

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – సింహ‌చ‌లం – వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి విశాఖపట్నం మధురవాడ దుర్గా నగర్ కు చెందిన కె సూర్యచంద్రరావు 350 గ్రాముల బంగారు హారంన నేడు కానుకగా అంద‌జేశారు.. ఆలయ కార్య నిర్వహణ అధికారి యస్ శ్రీనివాసమూర్తి ఈ హారమును ఆలయ గోల్డ్ అప్రైజర్ సాంబమూర్తి పరీక్షించి తూనిక వేసి తదుపరి భ‌క్తునికి రసీదును అంద‌జేశారు. కాగా, వారికి ఆలయ సంప్రదాయ ప్రకారము బేడ ప్రదక్షణ చేయించి అంతరాలయంలో స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. తదుపరి ఆలయ వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్ వారిని దుశ్శాలువ‌తో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు . ఈ సంద‌ర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు వారిని అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు సహాయకారి నిర్వహణాధికారి రమణమూర్తి ఆనంద్ కుమార్ పి ఆర్ ఓ నాయుడు ఆలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement