Friday, September 20, 2024

AP | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని…

విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అవినాష్ బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టును తప్పించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్‌తో పాటు మరికొందరు నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement