Friday, September 20, 2024

AP: దేవ‌ర‌ప‌ల్లి రోడ్డుప్ర‌మాదం… దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన జ‌గ‌న్, పురంధేశ్వ‌రి

విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి వ‌ద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాద ఘటన పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని పురంధేశ్వరి తెలిపారు.


దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతిచెందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement