Tuesday, October 22, 2024

Visakha | రిషికొండ పర్యాటక భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

విశాఖలోని రిషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ శ్రీభరత్ కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా, వారు బయట ఉద్యానవన పనులు చేస్తున్న మహిళా కూలీలతో కాసేపు మాట్లాడి, వారి కష్టాలను గురించి తెలుసుకున్నారు.

ఈ సమయంలో, పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాలపై జరుగుతున్న న్యాయ పోరాటం అంశంపై ఎంపీ శ్రీభరత్ నుండి వివరణలు కోరారు. ఎన్జీటీ నియమాలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో కట్టిన ఈ ప్యాలస్ ప్రస్తుతం పూర్తి నిరుపయోగంగా ఉంది అని, ఈ ప్యాలస్ ను రానున్న రోజుల్లో అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement