Saturday, September 21, 2024

AP: విజయసాయి కుమార్తెకి చెందిన స్టార్ హోట‌ల్ నిర్మాణాలు కూల్చివేత..

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి త‌న‌ న‌క్ష‌త్ర హోట‌ల్ కోసం ఆక్రమిత స్థలంలో కాంపౌండ్ వాల్ ను నిర్మించారు. దీంతో ఇక్క‌డ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలున్నాయి. సుమారు 4ఎకరాల స్థలంలో ఈ అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిల్‌ వేశారు. ఈక్రమంలో కోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపు చేపట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మరోసారి తాజాగా శనివారం కూల్చివేతలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement