Saturday, June 29, 2024

TTD | తక్కువ ధరకే రుచికరమైన భోజనం.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలోని హోటళ్లపై టీటీడీ నూత‌న‌ ఈఓ జె.శ్యామలరావు శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తులకు తక్కువ ధరలకే రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు.

ఇందుకోసం ప్రముఖ హోటళ్ల జాబితాను రూపొందించేందుకు ఇండియన్ క్యులినరీ ఇనిస్టిట్యూట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు చలేశ్వరరావు, తాజ్ హోటల్స్ జీఎం చౌదరి సూచనలను ఆహ్వానించారు. మరోవైపు టీటీడీ ఐటీ విభాగం అందిస్తున్న సేవలపై టీటీడీ ఈవో సమీక్ష కూడా నిర్వహించారు.

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఈవో తనిఖీ చేశారు. అక్క‌డ‌ యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించారు. టీటీడీ అందిస్తున్న ప్రసాదాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు అన్నప్రసాదాన్ని మరింత రుచిగా అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement