Sunday, September 8, 2024

Delhi నాలుగు సార్లు వెళ్లి ఏం సాధించారు – షర్మిల

ఆంధ్ర ప్రభ. స్మార్ట్ – అమరావతి : ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఏపీలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. ఆయన ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..

‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుంది చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఉన్నాయని విమర్శలు ఎక్కుపెట్టారు. .ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు… ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు? అంటూ చంద్రబాబుపై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

అంతేగాక, ‘గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ?’ అంటూ చంద్రబాబును నిలదీశారు వైఎస్ షర్మిల.

.”ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది అంటూ వైఎస్ షర్మిల ఎక్స్(ట్విట్టర్) వేదికగా బీజేపీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement