Wednesday, September 18, 2024

Delhi – మోడీ, అమిత్ షా లతో నేడు చంద్రబాబు భేటి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

కాగా, నిన్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement