Thursday, September 19, 2024

AP: గ‌ల్లంతైన యువ‌కుడి మృత‌దేహం ల‌భ్యం..

తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు గణేష్ నిమజ్జనానికి వెళ్లి సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. పట్టణంలోని కావమ్మ గుడి, చాకలి కాలనీకి చెందిన ముని రాజా, శ్రీనివాసులు, ఫయాజులతో పాటు నాయుడుపేట వాసులు వినాయక ఉత్సవాలను ముగించుకుని గణేష్ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు.

సముద్రంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలోనే మునిరాజా, శ్రీనివాసులు, ఫయాజులు సముద్రంలో మునిగిపోయారు. వారిలో ఫయాజ్ అక్కడే దుర్మరణం చెందగా.. మునిరాజా మృతదేహం సముద్రంలోనే కొట్టుకుపోయింది. శ్రీనివాసులును మాత్రం స్థానికులు సురక్షితంగా కాపాడారు.

గల్లంతైన మునిరాజా మృతదేహం మంగళవారం సముద్రపు ఒడ్డుకు కొట్టుకుపోవ‌డాన్ని గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానిక తహశీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషాద సంఘటన నాయుడుపేటలో అందరినీ కంటతడి పెట్టించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement