Friday, September 6, 2024

TG | వివేకా హత్యకేసు… దస్తగిరి పిటిషన్‌ను అనుమతించిన కోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఇప్పటికే తనను సాక్షిగా చేర్చినట్లుగా కోర్టుకు తెలిపారు.

తనను నిందితుల జాబితా నుండి తనను తొలగించి…. సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. దస్తగిరి తరపు న్యాయవాది వాదనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement