Thursday, October 3, 2024

Indrakiladri | వజ్ర కిరీటధారిగా.. బాల త్రిపుర సుందరీ దేవి దర్శనం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై శరవన్నరాత్రోత్సవాల సందర్భంగా నేడు కనక దుర్గమ్మ తల్లి బాల త్రిపుర సుందరి దేవీగా భక్తులకు దర్శనం ఇచ్చిన వేళ.. దుర్గమ్మతల్లి అనూహ్యంగా వజ్ర కిరీటి ధారిగా భక్తులకు కనిపించారు. 2.50 కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ముంబై కి చెందిన సౌరబ్ గౌర్ విరాళంగా అందించారు.

ప్రస్తుతం దసరా ఉత్సవాల ఆరంభం సందర్భంగా గురువారం అర్చకులు అమ్మవారిని ఈ కిరీటంతో అలంకరించారు. కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్య, చంద్ర ఆభరణాలు, వెస్ట్ గోదావరి జిల్లా ఖండవల్లి కి చెందిన సూర్యకుమారి వజ్రాల తో పొదిగిన ముక్కెర, నత్తు, బులకీ, కర్ణభరణలు ‎కూడా నేడు అమ్మ‌వారికి అలంక‌రించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement