Tuesday, September 17, 2024

Daring & Dashing – తిరగబడిన మహిళ… పరుగులు తీసిన….

ఆంధ్రప్రభ స్మార్ట్, పల్నాడు : నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి యత్నించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్‌ వద్ద ఆదివారం రైలులోని బీ-5, ఎస్‌-10, ఎస్‌-13 బోగీల్లోకి ప్రవేశించి చైన్‌ లాగి రైలును ఆపారు.

ఈ క్రమంలోనే ఓ మహిళ నుంచి గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె ఎదురు తిరిగింది. కేకలు వేసింది. ఆర్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ క్రమంలోనే దొంగలు రైలు దిగి పారిపోతూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement