Saturday, October 5, 2024

Cuddapah రిమ్స్ లో వైఎస్సార్సీపీ కార్యకర్తకు జగన్ పరామర్శ

( ఆంధ్రప్రభ స్మార్ట్, కడప ప్రతినిధి) – కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని వేంపల్లి లో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్ ను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్.. కడప మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కాగా.. వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్ పై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి రిమ్స్ కు చేరుకుని బాధితుడు అజయ్ ను కలిసి దాడి జరిగిన విధానం గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. నేనున్నాను.. భయపడవద్దు ధైర్యంగా ఉండాలి.. అంటూ ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement