Monday, October 21, 2024

Cuddapah – ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆ కేసును విచారించండి – చంద్రబాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో : కడప జిల్లా బద్వేల్ లో యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా చలించిపోయారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై నిన్నటి నుంచి పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి… ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు.

నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సీఎంకు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సీఎం అన్నారు. ప్రత్యేక కోర్టు లో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ఘటనలో నిందితుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement