Sunday, September 15, 2024

AP | రూప కల్పన లో వికసిత ఎపి 2047 విజన్ డాక్యుమెంట్..!

అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.

2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీని అభివృద్ధి చేయడ‌మే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు. ఈ నెల 28న జరిగే మంత్రి మండలి సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047 ను ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే సెప్టెంబరు 1 నుండి 15 వరకూ విజన్ డాక్యుమెంట్ పై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాల సేకరిస్తాం అని తెలిపారు.

సెప్టెంబరు 10-15 మధ్య మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని.. 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటీల నిర్వహణ ఉంటుందని తెలిపారు. సెప్టెంబరు 15-24 మధ్య ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు చేస్తామ‌న్నారు. సెప్టెంబరు 25న వికసిత్ ఏపీ విజన్ 2047 తుది ముసాయిదా సమర్పిస్తాం అని నీరబ్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement