Sunday, September 8, 2024

Tirumala : భ‌క్తుల ర‌ద్దీ… ద‌ర్శ‌నానికి 24గంట‌ల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుంది.

శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్ మెంట్‌ల‌న్నియూ నిండిపోయాయి. నిన్న 76, 369 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 41, 927 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 63 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement