Wednesday, October 23, 2024

Cricket – నితీష్, రికీ భుయ్‌లకు ఏసీఏ కార్యదర్శి సానా అభినందనలు

విశాఖపట్నం, – ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్‌–ఎ జట్టులో ఆంధ్ర నుంచి యువ క్రికెటర్లు కె.నితీష్‌ కుమార్‌ రెడ్డి,రికీ భుయ్‌లకు చోటు దక్కడం అభినందనీయం అని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్‌ బాబు అభినందనలు తెలియజేశారు

పురుషుల సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా– ఎ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా–ఎతో ఈ జట్టు రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది తర్వాత పెర్త్‌లో టీమ్‌ ఇండియా ఆటగాళ్లతో కలిసి అంతర్గత ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement