Sunday, September 15, 2024

ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా? : సీపీఐ రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రేపల్లెలో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన విచారకరమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టం ఏమైందని ఆయన అడిగారు. రాష్ట్రంలో వరుస ఘటనలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. హోంమంత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రటంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సీఎం జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement