Friday, September 20, 2024

Nandyala: అప్పుల బాధతో.. దంపతుల ఆత్మహత్య..

వెలుగోడు : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వెలుగోడు మండల పరిధిలోని అబ్దుల్లాపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది.

దంప‌తులు మహేశ్వర్ రెడ్డి (40), శాంతి (35) పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వీరు సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement