Wednesday, September 18, 2024

AP: చంద్రబాబుపై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రశంసల జల్లు..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 2 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సిడబ్ల్యుసి సభ్యులు ఎన్ .రఘువీరారెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు. శుక్రవారం ఈ మేరకు రఘువీరారెడ్డి ఒక వీడియోను విడుదల చేశారు.

నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మడకశిర సమీపంలోని కే గుండుమల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బలవంతపు జన సమీకరణ చేయకుండా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకోవడం అభినందనీయం. ఇదే సందర్భంలో పదేళ్లుగా మడకశిర ప్రజలు అనేక సమస్యలను భరిస్తూ వచ్చారు. వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తూ పలు హామీలు ఇవ్వడం సంతోషకరం.


రాహుల్, ప్రియాంక లకు అభినందనలు….
కేరళ రాష్ట్రంలోని వైయనాడు జిల్లాలో సంభవించిన భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందారు. పరిస్థితులు దారుణంగా మారిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అక్కడ పర్యటించి బాధితులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement