Friday, October 18, 2024

Condolences – రామోజీ మృతికి జ‌గ‌న్, ఎపి గ‌వ‌ర్న‌ర్ సంతాపం ..

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిని చూకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గవర్నర్‌ సంతాపం..
రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement