Friday, September 20, 2024

AP | పెట్టుబడుల కోసం.. వారితో సీఎం భేటీ రేపే

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

చంద్రబాబుతో రేపు టాటా గ్రూప్ చైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీఎం నివాసంలో ఈ సమావేశం జరగనుంది. అనంతరం సిఐఐ డిజి చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో సిఐఐ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై చంద్రబాబు సీఐఐ ప్రతినిధులతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement