Saturday, September 21, 2024

AP : ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

సీఎం జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఇవాళ ఆయ‌న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. 85 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించినున్న సీఎం జగన్.

ఇవాళ ఉదయం తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌. అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ శ్రేణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement